ధరణి పోర్టల్ పెండింగ్ లో 468 దరఖాస్తులు

మందమర్రి, నేటిధాత్రి:-

ధరణి పోర్టల్ పెండింగ్ లో 468 దరఖాస్తులు ఉన్నాయని శుక్రవారం మందమర్రి తహసిల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే, ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, మండలంలో భూ సమస్యల పరిష్కారం కొరకు రెండు జిల్లాల కలెక్టర్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు టీంలలో 11 మంది సభ్యులు ఉంటారని వివరించారు. మార్చి 01 నుండి 09 వరకు స్పెషల్ డ్రైవ్ ఉంటుందని అన్నారు. సీసీఎల్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మండలంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నిస్తుందని అన్నారు. ఇలాంటి సమస్యలను ఎలా ఆవిష్కరించాలి అనేదానిపై సభ్యులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. తమ బృందానికి కావలసిన పత్రాలు దరఖాస్తుదారులు చూపెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రవీందర్, ఆర్ఐ పద్మజ, సీనియర్ అసిస్టెంట్ మోహన్, జూనియర్ అసిస్టెంట్ తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *