మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మంగళవారం రోజు చేవెళ్లలో జరిగిన ప్రోగ్రాంలో ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు 500కే సిలిండరు 200 యూనిట్లు ప్రి కరెంటు అమలు చేయడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు.సంతోషంలో సీఎం రేవంత్ రెడ్డి కి అనిరుద్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ మునిసిపాలిటీ మహిళా అధ్యక్షురాలు మాణిక్యాల స్వప్న .. మండల అధ్యక్షురాలు అనిత.రాధిక అరవిందమ్మా, గ్రామ అధ్యక్షురాలు టౌన్ కమిటీ మెంబర్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.