ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాత్కపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి సదయ్య లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార జిల్లా అధికారి శ్రీ మాల తెలియజేశారు అనంతరం చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాట్లాడుతూ నాకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే విజయరమణారావుకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కి అదేవిధంగా నాకు సహకరించిన నాతోటి డైరెక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు వారి ఆలోచన విధానంతో ముందుకెళ్తానని రైతుల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే పని చేస్తామని ఆరు కాలం కష్టపడి పండించిన పంటను ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రతి గ్రామంలో కోపరేటివ్ సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ నేపథ్యంలో అధ్యక్షుడు తాళ్లపల్లి సదయ్య మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించిన మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు రైతులు పండించిన దాన్యం సకాలంలో కొనుగోలు చేసే విధంగా అదే విధంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా ఉత్కంఠ భరితంగా సాగిన చైర్మన్ పై అవిశ్వాసంలోకి సోదరుడు సుమన్ రెడ్డికి చైర్మన్ రావడం చాలా ఆనందంగా ఉందని దీనికి సహకరించిన మిగతా డైరెక్టర్లకు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాలతో సహకార సంఘం అభివృద్ధికి తమ వంతు తప్పకుండా సహకారాలు అందిస్తామని రాబోయే కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ విద్యానగర్ నాయకత్వంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారు పండించిన పంట సేకరించడంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా రైతుల కళ్ళల్లో ఆనందం నింపడమే మా ప్రభుత్వ ద్వేయమని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కట్కూరి కవిత బొంగోని శ్రీనివాస్ కాంతాల సమ్మిరెడ్డి చింతం కుమార్ స్వామి కోట విజయ గూగుల్ హర్షి నాయక్ సీఈవో అంజిరెడ్డి అంకం రమేష్ ఎంపిటిసి రాగి రవీందర్ రెడ్డి చీకట్లో మొండయ్య తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.