కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అలాగే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బి ఆర్ ఎస్ పార్టీ లాగా ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేత కాదని మాట ఇచ్చిన మంటే అమలు చేయడం తప్ప వేరే చేయమని కొందరు పనిగట్టుకుని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు హామీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారని దయచేసి ఇకముందు అయినా వారు పద్ధతి మార్చుకోవాలని ఇదివరకే రెండు హామీలు నెరవేర్చామని రేపు మరో రెండు హామీలు నెరవేరుస్తామని ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి సాగిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ పై విశ్వాసం లేకనే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరూ ఒకటేనని గుర్తు చేస్తూ ఇక ముందైనా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరెళ్ల నరసింహ గౌడ్ లింగాల భూపతి గుగ్గిళ్ళ శ్రీకాంత్ పొన్నాల పరుశురాం ఎగుర్ల ప్రశాంత్ మోర లక్ష్మీరాజ్యం ఆసాని సత్యనారాయణ రెడ్డి సామల గణేష్ బాలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ బండి పరిసరం గోగు తిరుపతి కుల శంకర్ ఎండి సలీం అల్వాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!