గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం

నడికూడ,నేటి ధాత్రి:

మండల కేంద్రంలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పిస్తూ,పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యమని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థినిలు తెలిపారు.వారు మాట్లాడుతూ విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు,తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు అని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడలు సమస్య అధికం అవుతుండడంతో తెగుళ్ళను, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ, విత్తడానికి ముందే విత్తనశుద్ధి చేయడం ద్వారా విత్తనం,నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నామనీ
కూలీల పై పెట్టె ఖర్చును తగ్గించుకోడానికి తోడ్పడుతుందని కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సార్ విద్యార్థినిలు శ్రీలత, శరణ్య,భవాని,సింధూ రావు, గాయత్రి,జోష్న,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!