వనపర్తి లో చిన్నపిల్లల కథ సుఖాంతం

విలేకరుల సమావేశంలో సీఐ ఏ స్ ఐ

వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణానికి చెందిన చిన్నపిల్లలు పావని మౌనిక ఏడవ తరగతి చదువుతున్నారు రోజువారీగా స్కూల్ కు వెళ్లారని సాయంత్రం తర్వాత ఇంటికి రాకపోవడంతో వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని వనపర్తి సీఐ నాగభూషణరావు టౌన్ ఎస్ఐ జయన్న వనపర్తి పోలీసు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితమూర్తి ఆదేశాల మేరకు నాలుగు బృందాలు ఏర్పాటుచేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నపిల్లల ఆచూకీ కనుగొన్నామని చిన్నపిల్లలు ఒక బ్యాగును తీసుకొని కర్నూల్ బస్సు ఎక్కారని తర్వాత బీచుపల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని గద్వాల వెళ్లారని అక్క డి నుండి మంత్రాలయం వెళ్లారని సీఐ చెప్పారు వెంటనే చిన్నపిల్లల గురించి మంత్రాలయం ఎస్సై కి వివరాలు చెప్పగా పిల్లలను పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చార ని అక్కడినుండి వనపర్తి ఎస్సై జయన్న మంత్రాలయం వెళ్లి చిన్నారులను వనపర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ తెలిపారు వనపర్తి లో చిన్న పిల్లల కథ సుఖాంతం అయింద కు విలేకరులకు ప్రజలకు సిఐ నాగభూషణరావు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!