
మంచిర్యాల నేటిదాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాన పవర్ ప్లాంట్ మూసివేసి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా పవర్ ప్లాంట్ యజమాని మల్కా
కొమురయ్య నిర్లక్ష్యం చేయడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కంపెనీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది, ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు నేటితో 20వ రోజుకు చేరుకున్న యాజమాన్యం స్పందించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం