ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు!!

ఎండపల్లి, నేటి ధాత్రి
ఎండపల్లి మండల కేంద్రం లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్.మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సింహాచలం జగన్ మాట్లాడుతూ.కెసిఆర్ తెలంగాణ తీసుకోచ్చిన అధినేత అంటూ బంగారు తెలంగాణ రాష్ట్రo ఏర్పాటుకు తన జీవితం ఏమైనా పర్వాలేదనీ దీక్ష పట్టి మన రాష్ట్రo నీళ్లు నిధులు నియామకాలు మనకు ఉంటాయి అని చెప్పిన ఎన్నో బంద్ లు ఉద్యమాలు పోరాటాలు తెలంగాణ గడ్డమీద జరిగాయి అని తెలుపుతు రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి ముఖ్య మంత్రి గా రాష్టాన్ని అన్ని రంగాల్లో దేశం లోనే ముందుంచిన గొప్ప నాయకుడు గత పాలకులు ఎవరు చెయ్యనంతగా ప్రతి రంగం లో అభివృద్ధి కెసిఆర్ చేశారు అని తెలియజేస్తూ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు చేస్కోవడం జరిగిందని జగన్ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు. ఏలేటి చంద్రారెడ్డి మండల కో అప్షన్ సభ్యులు ఎండీ రియాజ్. ఉపసర్పంచ్ మైలారం సతీష్. మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేష్. మండల ఎస్సి సెల్ నాయకులు పడిదేం వెంకటేష్. బిసి సెల్ అధ్యక్షులు చింతల తిరుపతి. పరందాములు,వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు గాధం భాస్కర్.జగతి గౌడ్.అరికిళ్ల మహేందర్.గౌరు చిరంజీవి. మాజీ సర్పంచ్ గంధం లక్ష్మి నారాయణ.మరియు పడిదం మొగిలి బోయిని మధు ,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!