హసన్ పర్తి/ నేటి ధాత్రీ
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని దేవన్న పేట లో తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కె సి ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా 65 వ డివిజన్ కార్పొరేటర్ గుగులోతు దివ్య రాణి – రాజు నాయక్ హాజరై పుట్టినరోజు కేకు ను కట్ చేసి కె సి ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆనంతరం, అందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ యస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పోలేపెల్లీ రాజు (మైకేల్) మాజీ సర్పంచ్ చుంచు రవి, చుంచు విజేందర్, సూరం కరుణాకర్, పొలేపల్లి సాంబయ్య, సూరం రాజు, చుంచు సదానందం, విశ్వనాథ్, మేకల సుదన్, సందెల రాజు మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.