దేశవ్యాప్త సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె విజయవంతం

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్

మందమర్రి, నేటిధాత్రి:-

కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మె విజయవంతం చేశారని, సమ్మె విజయవంతానికి కృషి చేసిన కార్మిక వర్గానికి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు తరుపున ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి, పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు దూరం శ్రీనివాస్ మాట్లాడుతూ, బిజెపి మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్లకు బలాన్ని ఇచ్చే లేబర్ కోడ్ లను తేవడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వెంటనే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, అలాగే రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని, పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించి, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు అందుబాటులో ఉంచాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో మాదిరిగా హైపర్ కమిటీ వేతనాలను అమలు చేసి, వారు చేసే పనికి పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో కొన్ని కార్మిక సంఘాలు సమ్మె విచ్చిన్నానికి ప్రయత్నాలు చేసిన, సమ్మె ప్రాధాన్యతను అర్థం చేసుకొని స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తొత్తుగా వ్యవహరించే సంఘాలకు బుద్ధి చెప్పే విధంగా కార్మిక వర్గం తీర్పుని ఇవ్వడం హర్షినియం అన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం వైపు దృఢంగా నిలబడే విధంగా సంఘాలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు, ఓబి కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!