ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేత
ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి: బొట్ల నరేష్
హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగుల పేరుతో నిరుద్యోగం నుండి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్న ఏజెన్సీలపై చర్య తీసుకోవాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా పత్రం అందజేశారు అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ…. హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలోని కొన్ని శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల నుండి ఉద్యోగం ఇప్పిస్తాననీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలో మధ్యవర్తులు ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసుకొని మరి అమ్ముకున్నట్లు వివిధ దినపత్రికలో రావడం జరిగిన సంబంధిత జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.