జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి రవి ని గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించారు. తమ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపించడమే కాకుండా పేద వారికి తోచిన సాయం చేస్తూ చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా ఉండేవారని మాజీ సర్పంచ్ మేడి రవి ని గ్రామ పెద్దలు కొనియాడారు.