ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదు

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో ఘోర పరాజయం తప్పదని ఎంసిపిఐ జిల్లా నాయకుడు కేశెట్టి సదానందం అన్నారు. నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని, ప్రజా ఆకాంక్షల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.హామీలు అమలుచేయని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు,మండల కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,గ్రామ పార్టీ కార్యదర్శి జవాజి చంద్రమౌళి, కందికొండ నరసింహస్వామి, కానుగంటి చంద్రమౌళి,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!