అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 07

అధికారులు చిత్త శుద్ధితో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నంబర్ 1 నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.

మంగళవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం లో ఉప్పల్ డివిజన్ జిహెచ్ఎంసి డి సి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అన్ని విభాగాల సమీక్ష సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అందరూ తమ డివిజన్ల లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గీత ప్రవీణ్ ముదిరాజ్, చేతన హరీశ్, బండారి శ్రీవాణి వెంకట్రావు,తాసిల్దార్ నర్సింహా రెడ్డి, ట్రాఫిక్ సి ఐ అశోక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!