ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ గ్రామం లో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారo పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ భవిష్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 11 మండలాలలోని దాదాపు 4538 పదవ తరగతి విద్యార్థులకు 36 రోజులు ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 10 రూపాయల చొప్పున అల్పాహారాన్ని అందించే బృహత్తర కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వారి యొక్క నిధుల నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెకండరీ విద్యాశాఖ ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి జడ్పీ హెచ్ఎస్ చెల్పుర్ పాఠశాలలో విద్యార్థులకు అరటి పండ్లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్జెడి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా ఇష్టంతో చదివి ఉత్తమమైన ఫలితాలను కైవసం చేసుకోవాలని మీ ప్రతిభ ద్వారా తల్లిదండ్రులకు మరియు మీ గురువులకు మంచి పేరు తేవాలని ఉత్తమమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎం రామ్ కుమార్ ఏ సి జి ఈ ఎం రవీందర్ రెడ్డి డి సి ఈ బి సెక్రటరీ శ్రీ ఓ చంద్ర శేకర్ , ఏడి రాజేందర్ , డి సి ఈ డి అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె అశోక్ , మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రవీందర్, సత్యనారాయణ, ఓదేలు, చంద్రు, రాధా,జ్యోతి, నరేందర్, కల్పన, జయ, రియాజు
మొదలగు వారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!