7వా రోజుకు చేరిన శాలివాహన ఎవర్ గ్రీన్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష

నేటిదాత్రి మంచిర్యాల

7వా రోజుకు చేరిన శాలివాహన ఎవర్ గ్రీన్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష ఏ బి కే ఎం ఎస్ అఖిల భారత క్యాతన్ మజ్దూర్ సంఘం సెంట్రల్ సెక్రటరీ మరియు బిఎమ్ఎస్ స్టేట్ సెక్రటరీ మండ రమాకాంత్ జి ఒక్క రోజు నిరాహారదీక్ష లో పొలుగొన్నారు శాలివాహనం పవర్ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఏ విధమైన కార్మికులకు న్యాయం చేయకుండా యాజమాన్యం ఏకపక్షంగా మూసి వేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు శాలివాహనం ప్రాజెక్టులో పనిచేస్తున్న వందలాది మంది కుటుంబాల జీవితాలు రోడ్డుపాలు అయ్యాయి వాళ్ల జీవితాలు ఆగమ్య గోచరంగా మారాయి. వాళ్లు ఏ విధమైన చట్టాలను గాని ఏ విధమైన కారణం గాని కార్మికుల చట్టాలను పట్టించుకోకుండా ప్రాజెక్టుని మూసేశారు. కార్మికులకు న్యాయపరంగా రావాల్సిన గ్రాడ్యుటి గాని ఇతర బెనిఫిట్స్ చెల్లించకుండా ఏకపక్షంగా యాజమాన్యం శాలివాహన పవర్ ప్లాంట్ ను మూసివేయడం జరిగింది. శాలివాహనం పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులు ఎన్నో విధాలుగా విజ్ఞప్తి చేశారు. అన్ని కార్మిక సంఘాల వారు కూడా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా యాజమాన్యం నుండి ఏ విధమైన అటువంటి స్పందన యాజమాన్యం ఇవ్వటం లేదు. ఏ ఎఫ్ సి వారిని కలిసిన అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో అందరూ కలిసి ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం దిగివచ్చి కార్మికులకు రావలసిన బకాయిలు, హక్కులున్నాయో వాటిని చెల్లించవలసిందిగా భారతీయ మజ్దూర్ సంఘం అధ్యక్షతన విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా యాజమాన్యం కళ్లు తెరిచి కార్మికుల ఆదుకోవాలని కోరుచున్నాము. లేనిపక్షంలో నిరాహార దీక్షలు ఇంకా వృద్ధుతం చేయడం జరుగుతుంది.అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!