వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో మంగళవారం నాడు జరిగిన వర్తక సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కoది కొండ సాయిరాం పై 66 ఓట్ల ఆధిక్యత తో పాలాది సుమన్ విజయం సాధించారు మొత్తంన పోలైన ఓట్లు 147. కందికొండ సాయిరాంకు 40 ఓట్లు, పాలాది సుమన్ కు 106 ఓట్లు, మరిడి వెంకటరమణకు కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది ‘ కనీసం ఆయన డిపాజిట్ కూడా దక్కించుకోలేదు ఈ ఎన్నికలను
వర్తక సంఘం పరిశీలకులు లగిశెట్టి నరసింహ, కలకొండ సురేష్ బాబు, దాచ లక్ష్మీనారాయణ, గోనూరు వెంకటయ్య , ఆర్. టి .బాలకృష్ణ,వర్తక సంఘం మాజీ అధ్యక్షులు కొ ట్ర రామకృష్ణ తదితరులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు కిరాణం వ్యాపారులకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు