గీత కార్మికులకు సేఫ్టీమోకు మోపేడ్ లు పంపిణీ చేయాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి :

గీత కార్మికులకు వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీమోకు, మోపేడ్ బైక్ లు పంపిణీ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు వాగ్దానం చేసిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ ఎన్నికల మేనిపెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు అమలుకు వెంటనే జీ.ఓ. జారీ చేయాలని పేర్కొన్నారు. తాటి చెట్ల పై నుంచి ప్రమాద వషాత్తు పడిన గాయపడిన, చనిపోయిన గీత కార్మికులకు హాస్పిటల్ ఖర్చులు, ఎక్స్ గ్రేషియా గత నాలుగు నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణా కల్లు గీత కార్పొరేషన్ కు నూతన చైర్మన్, పూర్తి స్థాయి కమిటీని నియమించాలని, గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని, ఎక్స్ గ్రేషియా చెల్లింపులకు అడ్డంకిగా ఉన్న మెడికల్ బోర్డు ఎత్తి వేయా లని, ఎక్స్ గ్రేషియా 5 నుండి 10 లక్షలకు పెంచాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అనంతరం సర్వాపురం సీనియర్ గౌడ సంఘం నాయకులు కొండి రాము గౌడ్ ను జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రచారం కార్యదర్శి గోడిశాల సదా నందం గౌడ్,రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శీలం వీరన్న గౌడ్, దొంతి సంతోష్ గౌడ్,బుడిగె మల్లేష్ గౌడ్ , ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, డివిజన్ కార్యదర్శి కల్లెపు వెంకట్ గౌడ్, మండలం అధ్యక్షులు జనగాం మల్లికార్జున్ గౌడ్, సట్ల సురేష్ గౌడ్, మండ రవి గౌడ్, దొమ్మటి శ్రీనివాస్ గౌడ్, బూరుగు పెద్ద కట్టయ్య గౌడ్, సట్ల సంతోష్ గౌడ్, నాతి వెంకట్ గౌడ్, నాతి శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *