జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో 2019 లో ఏర్పడిన పాలకవర్గాన్ని గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది.గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు మరియు మోడల్ పంచాయతీగా గుర్తించినందుకు సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ ని వార్డు సభ్యులను గ్రామస్థాయి అధికారులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు , సెక్రెటరీ , గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.
శెట్టిపల్లి సర్పంచ్ కి ఘన సన్మానం
సర్పంచ్ గా 5 ఏండ్ల పదవి కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ మేడి రవి ని హెచ్ ఈ ఓ గంగన్న, ఏ ఎన్ ఎం స్వరూప, పంచాయతీ సెక్రెటరీ ప్రతిభ, ఆశ వర్కర్ రాణి మల్టీ వర్కర్స్ ఘనంగా సన్మానించారు.