సంఘమిత్ర టెక్నో స్కూల్లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రధానం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ దేశాయిపేట రోడ్డులో గల, సంఘమిత్ర టెక్నో స్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీల సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఐదవ తరగతి చదువుతున్న కందికొండ సాత్విక్ రాజ్ మొదటి బహుమతి అందుకున్నారు. మూడవ తరగతికి చెందిన బాలుర విభాగంలో కందికొండ సిద్ధార్థ్ రాజ్ రెండు ఆటలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుపొందారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ మహేందర్ చేతుల మీదుగా సాత్విక్ రాజ్, సిద్ధార్థ్ రాజ్ షీల్డులు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *