శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలోజర్నలిస్టు కాలేశ్వరం నర్సయ్య తల్లి కాలేశ్వరం ఉప్పలమ్మ బుధవారం రోజు మరణించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి పత్తిపాక గ్రామంలోని జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించి మృతురాలి పార్థివదేహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని ఎంపీపీ అన్నారు. బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, టి ఆర్ ఎస్ ఉద్యమ నాయకులు బలిజె నరసింహ రాములు,స్థానిక సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య, శాయంపేట ఉప సర్పంచ్ సుమన్,బిఆర్ఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్,బిఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి,మారపల్లి మోహన్,కరణ్ బాబు తదితరులు ఉన్నారు.