కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మా సంకల్పం వికసిత భారతం

ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ జనార్ధన్.
నల్లబెల్లి, నేటి ధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేక రకాల బీమాలు యువతకు ప్రోత్సాహకాలు అందించడమే మా సంకల్పం వికసిత భారతం అని స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ టి జనార్ధన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ నానబోయిన రాజారాం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయా శాఖల కు సంబంధించిన అధికారులు హాజరై కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మేనేజర్ జనార్ధన్ మాట్లాడుతూ.. బ్యాంకుల ద్వారా. పోస్ట్ ఆఫీస్ ల ద్వారా అందించే కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రధానమంత్రి జనగాని యోజన. పీఎం సురక్ష బీమా యోజన. పీఎం జీవనజ్యోతి బీమా యోజన. అటల్ పెన్షన్ యోజన. పీఎం స్వామిజి యోజన. తో పాటు బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంకల్ప యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా వంటగ్యాస్ కలెక్షన్. పీఎం ముద్ర యోజన. ప్రతి కుటుంబం పౌష్టికాహారంతో జీవించడమే సంపూర్ణ ఆరోగ్య భారతానికి దూరపడుతుందని స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ అధికారి జె కుమారస్వామి పేర్కొన్నారు. వ్యవసాయ రంగం ద్వారా పిఎం కిసాన్. కిసాన్ సమృద్ధి యోజన పథకాలతో పాటు ఆహార భద్రతకు భరోసా కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకమని వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పిఎం జనారోగ్య యోజన. పీఎం భారతీయ జనఉషధి పరియోజన కార్యక్రమం ద్వారా నాణ్యమైన ఔషధాలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు ప్రతి గ్రామ మండల కేంద్రాల్లో ఆరోగ్య సెంటర్ల పటిష్టత కార్యక్రమం చేపట్టడం జరిగిందని స్థానిక వైద్యాధికారి పిబి ఆచార్య పేర్కొనడం జరిగింది. వీటితోపాటు వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేయడం తోపాటు అవగాహన కల్పించి భాగస్వాములు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో. స్థానిక ఎంపీటీసీ జన్ను జయరావు పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్. వెలుగు ఏబీఎం సునీత. వివిధ శాఖల అధికారులు. అంగన్వాడి లు ఆశా వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!