పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఓటు నమోదు చేసుకోండి

గతంలో చేసుకున్న మళ్లీ ఫ్రెష్ గా ఓటు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది

👉 టీ.జి.ఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిర్రా రాజు గౌడ్

*2020 సెప్టెంబర్ 1 వరకు ఏదైనా డిగ్రీ పాసైన గ్రాడ్యుయేట్స్ అందరు రాబోయే వరంగల్, ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీ ఓటు నమోదు చేసుకోవాల ఈ రోజు యూనివర్శిటీ కామర్స్ విభాగంలో డా,, మాదాసి కనకయ్య ఆధ్వర్యంలో దరఖాస్తు ఫారం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం (టి.జి.ఫ్) రాష్ట్ర అధ్యక్షులు, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా,,చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2020 నవంబర్ 01 లోపు ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లమా, పూర్తి చేసిన న్యాయవాదులు, డాక్టర్స్ అధ్యాపకులు,ఉద్యోగస్తులు నిరుద్యోగులు అందరు ఆన్ లైన్ లో సైట్
ceotelangana.nic.in
గానీ ఆఫ్ లైన్ లో గానీ తమ ఓటు నమోదు చేసుకోని త్వరలో జరగబోయే వరంగల్ నల్గొండ,ఖమ్మం పట్టపద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో పాల్గొనాలంటే మీరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఆయన పిలునిచ్చారు, అలాగే గతం లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఓటు ఉన్నా గాని మళ్లీ ఫ్రెష్ గా అప్లై చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజుగారు నోటిఫికేషన్ లో తెలపడం జరిగింది ఇది గమనించగలరని వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తదితరులు కాకతీయ యూనివర్సిటీ కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పనిందర్ డాక్టర్ సునీత, డాక్టర్ మాయూరి, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గిరిప్రసాద్, తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!