నివాళులు అర్పించిన తెదేపా అధ్యక్షుడు కూతాడి నర్సింహ…
మేడిపల్లి(నేటీదాత్రీ): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ తెదేపా అధ్యక్షుడు కూతాడి నర్సింహ ఆద్వర్యంలో కీ”శే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షుడు కూతాడి నర్సింహ, పార్టీ నాయకులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దొడ్ల భాస్కర్ రెడ్డి, గడ్డం లక్ష్మణ్, డా. శ్రీనివాస్, వెంకటేష్, రాఘవ రెడ్డి, శృంగారపాటి గణేష్, ఖాధర్, రాగ వీరమణి, సువర్ణ, ఆమని, కృష్ణవేణి, శ్రీనివాస్, పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.