*ఎస్పీ అఖిల్ మహాజన్
కొనరావుపేట, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్ స్టేషన్ ను ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డితో పాటు ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, రెస్ట్ రూమ్,లాక్ అప్ రూమ్ లను,5S అమలు తీరును పరిశీలించి,స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది అందరు అంకిత భావంతో పని చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాల్లో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది తరచు పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు. VPO సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలాల్లో పర్యటిస్తూ గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎస్పీ వెంట సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.