
కాంగ్రెస్ పార్టీ – అదానీ వ్యవహారంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్- బిజెపి కుమక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బిజెపి కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు
రాహుల్ గాంధీ ఏమో మోడీ-అదాని ఒక్కటే అంటున్నారు…
మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు
13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులు, అంతా ప్రధానమంత్రి కి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారు. ఎన్నికల ముందు అతని ఒక దొంగ అని రేవంత్ రెడ్డి అన్నారు.
కానీ అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానితో అలైబలై చేసుకుంటున్నాడు
ఈ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది
కాంగ్రెస్ ఢిల్లీలో అదానితో కొట్లాడుతూ… ఇక్కడ మాత్రం ఎందుకు అదానితో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలి
అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలి
బిజెపి ఆదేశాల మేరకే అదానితో ఇక్కడి ప్రభుత్వము, ఇక్కడి ముఖ్యమంత్రి కలిసి పని చేస్తున్నారు
అదానిపట్ల మారిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి కారణాలు ఏంటో చెప్పాలి
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు తిరగబడతారు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 అయ్యాయి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు… కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి
డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి అవుతున్న అని చెప్పి… రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి పదేపదే చెప్పాడు..
డిసెంబర్లో కరెంట్ బిల్లు సోనియాగాంధీ కడుతుందని చెప్పలేదు
రైతులకు 10,000 కాదు, 15000 ఇస్తా అన్నారు
రెండు వేల పెన్షన్ను 4000 చేస్తా అన్నాడు
కానీ వాటిని అమలు చేయమని గుర్తు చేస్తున్నాం
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు… మొన్న ఉత్తంకుమార్, రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి వీలులేదు అని చెప్పారు
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది… ఈ విషయాన్ని మహబూబ్నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి
మహబూబ్నగర్ కి పక్కనే ఉన్న అప్పర్ బద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బిజెపిని నిలదీసే ప్రయత్నం ఉత్తంకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు
ప్రియాంక గాంధీ 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ… కానీ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెబుతున్నారు
ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారు
గతంలో రోజుకు పది లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాము
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైన తర్వాత కూడా రైతుబంధు రైతు ఖాతాలలోకి వస్తలేదు
ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే… ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి
ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మళ్ళీ వచ్చినయ్… ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి పంచే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది
ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది.
నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ కి తక్కువ వచ్చిన ఓట్లు కేవలం సుమారు కేవలం నాలుగు లక్షల కోట్లు మాత్రమే
పార్టీకి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిధ్యం ఉన్నది
గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ప్రతి చోట పార్టీకి బలమైన నాయకత్వం, ప్రాతినిధ్యం ఉన్నది
ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదు
పార్టీ పైన గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు, కార్యకర్తల పైన ఉన్నది
ప్రభుత్వ ఉద్యోగాలు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించిన మనపైన విస్తృతమైన దుష్ప్రచారం జరిగింది
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది నేరుగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆయా కార్యక్రమాలను అమలు చేశాము
సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళేటట్లు చేశాం
దీనివల్ల ప్రభుత్వం, పార్టీ అనే తేడాను ప్రజలు తెలుసుకోలేకపోయారు… ప్రజలకు కోసం చేసిన కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగిందనే విషయం చెప్పలేకపోయాం
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం ఏటా 800 కోట్లు ఖర్చుపెడితే… మన ప్రభుత్వం 11700 కోట్లను ప్రతి ఏడాది ఖర్చు పెట్టింది
ఇంత భారీగా పెన్షన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందించినా చెప్పుకోవడంలో కొంత విఫలమయ్యాం
పార్టీ అన్ని స్థాయిలో కమిటీలను కొత్తగా వేసుకుంటాం… నిరంతరం అన్ని అంశాల పైన పార్టీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది
పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ వస్తున్నది
కార్యకర్తలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను నేరుగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి చేరవేయడం జరుగుతుంది
పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతది
గెలిచినప్పుడు పొంగిపోలేదు…ఓటమికి కుంగిపోము… ఎప్పుడైనా మా పార్టీ ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసమే పని చేస్తుంది
ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాలతో నాటకాలు మొదలుపెట్టింది
10 సంవత్సరాల కోసం, ప్రజల కోసం పనిచేసిన మన ప్రభుత్వంపైన దుష్ప్రచారానికి తెరలేపింది
అందుకే 10 సంవత్సరాలపాటు ప్రజలందరితో కలిసి కష్టపడి, చెమటోడ్చి తెలంగాణ కోసం చేసిన అభివృద్ధిని, ఆస్తుల రూపకల్పనను స్వేద పత్రం పేరుతో మనం ప్రకటించాం
అప్పులు కాదు… ఆస్తుల సృష్టించాం బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్కు అప్పజెప్పం
అదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గ్రామం నుంచి రాజధాని హైదరాబాద్ దాకా ప్రతి చోట అనేక వేలకోట్ల ఆస్తులను సృష్టించాం