ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా

మున్సిపాలిటీ కమిషనర్ కి వినతి పత్రం

అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ.

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజాసంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేసి మున్సిపాలిటీ కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపాలిటీ కమిషనర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, 2023 జనవరి 25న పాత ఎర్ర చెరువు లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని, పేదల నివసిస్తున్న పాత ఎర్ర చెరువులో మంచినీటి సౌకర్యం కల్పించాలని, నవంబర్ నెలలో ఫేస్ టు డబల్ బెడ్ రూమ్ కింద కేటాయించినటువంటి రూములకు లబ్ధిదారులందరికీ అలాట్మెంట్ లీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు తరఫున బంధు సాయిలు, వెలిశెట్టి రాజయ్య,ఆదివాసీ గిరిజన సంఘం తరఫున పోలేము రాజేందర్, కెవిపిఎస్ తరపున గుర్రము దేవేందర్, డివైఎఫ్ఐ తరఫున ఏ శ్రీకాంతు, మహిళా సంఘం తరఫున రజిని, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున చిన్న రాజేందరూ, రాజు పాత ఎర్ర చెరువు సర్వే నెంబరు 280,281,282,283,284,285,286 గుడిసెలు వేసుకున్న పేదలు సంవత్సరం కాలంగా పాత ఎర్ర చెరువులో నివాసం ఉంటున్నారు. నీటి సౌకర్యం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పాలకపక్షం పాత ఎర్ర చెరువులో నివాసముంటున్న పేదలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలి. సంవత్సర కాలంగా నివాసముంటున్న పాత ఎర్ర చెరువు గుడిషవాసులు అందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. నవంబర్ నెలలో ఫేస్ 2 కింద డబల్ బెడ్ రూమ్ లు రూము నెంబర్లు ఇచ్చి, బ్లాకు నెంబరు కేటాయించి, లబ్ధిదారులని ఎంపిక చేసిన ఇప్పటివరకు లబ్ధిదారులకు డబల్ బెడ్ రూములు కేటాయించకపోవడం అన్యాయం, అవకతవకలు జరిగి ఉంటే ఇండ్లున్నటువంటి వాళ్ళై నే సర్వే చెయ్యాలని అందరి పేదలని సర్వే పేరుతో ఇండ్లపటం సరికాదని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల గుడిసెల్ని పులుసు వేయవద్దని మనవి చేస్తున్నాము. జగిత్యాలలో గుడిసెలు కూల్చివేసి పేదల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అక్రమంగా జైలుకు పంపిన పేదలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో వి లక్ష్మి, ప్రీతి, స్మరణ్, రమేషు, శేఖర్, రవికుమార్, మహేందర్, స్వర్ణలత,శ్రీధర్,రోజా,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!