
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలో సోమవారం అయోధ్య పూజిత అక్షింతలు వైభవంగా నిర్వహించారు. పల్లకిలో అక్షింతల కలశంతో పాటు, రాముని చిత్రపటంతో పల్లకి సేవ చేపట్టారు.
భజన పాటలతో ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను భక్తులకు పంపిణీ చేశారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి అక్షింతలను స్వీకరించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, గ్రామంలోని అన్ని కులా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్దలు, మరియు మహిళలు, పిల్లలు, పెద్ద ఎత్తున పాల్గొన్నార.