భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని వరంగల్ మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు,షాహీద్ మసూద్ భూపాలపల్లి మున్సిపాలిటీని సందర్శించడం జరిగింది. ఇట్టి సందర్శనలో కార్యాలయంలో జరుగుచున్న ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ (online) సరళిని పరిశీలించి, ఆన్ లైన్ నమోదు తప్పులు లేకుండా,దరఖాస్తు దారుని వివరములు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సిబ్బందికి తెలిపీనారు.ఆన్ లైన్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కమీషనర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ మానస ఆర్ ఐ భాస్కర్ పాల్గొన్నారు.