వెల్గటూర్ మండలం లోని 15 మంది ఎంపిటిసి ల్లో అవిశ్వాసానికి 10 ఎంపిటిసి ల మద్దతు!!
మారుతున్న రాజకీయ సమీకరణాలతో పొలిటికల్ హీట్. !!
ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా లోని ఉమ్మడి వెల్గటూర్ మండలం లోని ఎంపిపి కూనమళ్ళ లక్ష్మి పై స్థానిక ఎంపిటిసి లు అవిశ్వాసం తీర్మాన పత్రం జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో ఎంపిటిసిలు సమర్పించడం జరిగింది,స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నిధులు మంజూరు లో తీవ్ర జాప్యం చేశారని విమర్శలు చేస్తున్నారు,గత బీఆర్ఎస్ సర్కార్ లో సర్పంచ్లు, ఎంపిటిసి ల ఆత్మహత్య లే ఎక్కువని ఆరోపణలు. చేశారు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంపిపి కేటాయిస్తే వెల్గటూర్ అభివృద్ధి.జరుగుతుంది అని,
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ అధ్వర్యం లో ధర్మపురి అభివృద్ధి జరుగుతుందని ఎంపిటిసి లు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
వెల్గటూర్ ఎంపిపి కూన మల్ల లక్ష్మి పై అవిశ్వాసం!!.
