ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన జగిత్యాల టిజెఎస్ నాయకులు

జగిత్యాల:

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమాల రథసారథి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ను జగిత్యాల జిల్లా టిజెఎస్ నాయకులు మంగళ వారం హైదరాబాద్ వెళ్లి కలిశారు. టిజెఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కేశపాక తరుణ్, నాయకులు గోగుల రాజు తదితరులు మంగళ వారం హైదరాబాద్ వెళ్లి ఆచార్య కోదండరాంను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ఎన్నికల ఫలితాల దృష్ట్యా కోదండరామ్ ను వారు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతుతో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై, కొన్ని చోట్ల ఓటమికి గల కారణాలపై కూలంకషంగా వారు చర్చించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు విధానం, టిజెఎస్ పక్షాన ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లాల్సిన ప్రజా సమస్యలను, అమరవీరుల త్యాగాలు, ఉద్యమ కారుల గుర్తింపు తదితర విషయాలపై చర్చించారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు, తెలంగాణ జన సమితి పాత్రపై కూడా వారు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!