పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో జరగబోయే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొంటున్న నేపథ్యంలో గురువారం రోజున పరకాల సిపి అంబర్ కిషోర్ జా సభాస్థలిని,హెలిపాడ్ ను మరియు పరకాల పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది.సభా ఏర్పాట్లను పరిశీలించి,బందోబస్తు విధుల ఆరతీయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపి శ్రీ కిషోర్ కుమార్,సబ్ డివిజన్ సిఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు.