ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
ధర్మపురి నియోజక వర్గం,ఎండపల్లి,మండలంలోని పాత గూడూరు గ్రామానికి చెందిన మల్యాల ప్రేమ (38)గురువారం మృతి చెందగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస రావు తక్షణ సహాయంగా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ సర్పంచ్ కొంగల చంద్రారెడ్డి ద్వారా మృతురాలి కొడుకు మల్యాల కుమార్ కు అందజేశారు.ఈ సంధర్బంగా మృతురాలి కుటుంబ సభ్యులు పిఎస్ఆర్ (బాపు)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బోయిని మధు, బోయిని సతీష్,బోయిని కుమార్ లు పాల్గొన్నారు.