మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న గ్రామ అభివృద్ధికి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని విడి యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కత్తెర శివనాంద్, కత్తెర నవీన్, కుర్వ బాలస్వామి వారందరికీ గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించరు.