మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర స్థాయి గౌడ సంఘాల ప్రతినిధులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ని,కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్,సమన్వయ కమిటి కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్,గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్,సమన్వయ కమిటీ కార్య నిర్వాహక చైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్,మన తెలంగాణ గౌడ సంఘం గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు బబూర్ బిక్షపతి గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ సదానందం గౌడ్,గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షులు పి రాజు గౌడ్, ఫురానపూల్ సొసైటి అధ్యక్షులు కొత్త నవీన్ గౌడ్,గౌలిపుర సొసైటి అధ్యక్షులు బి సురేష్ గౌడ్,లాల్ దర్వాజ సొసైటి అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమతి రాష్ట్ర నాయకులు పంజాల నర్సింహ్మ గౌడ్, నాయకులు మాలెల బాలక్రిష్ణ గౌడ్,విష్ణు గౌడ్,యన్.నిరంజన్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.