బి ఆర్ ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీ కి లేదు

*పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 3

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ ధర్మారావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టినటువంటి ఎన్నో అభివృద్ధి పనులు , ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి తాగునీరు ,సాగునీరు గతంలో ఏ విధంగా ఉండేదో , ఈ తొమ్మిది సంవత్సరాల నుండి ఏ విధంగా ఉందో ప్రజలు మీరే ఆలోచించాలని ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని ప్రజల కష్ట సుఖాలలో నేనున్నాను అని 108 లాగా పనిచేసే గండ్ర వెంకట రమణారెడ్డినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి అసెంబ్లీకి పంపాలని ప్రజలను ఆయన కోరినారు ,ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్, ఉప సర్పంచ్ సరోజన బాపూరావు, భారత రాష్ట్ర సమితి గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లేటి నరసింహ రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముడుపు రవీందర్, భారత రాష్ట్ర సమితి మండల నాయకులు మంగళపల్లి శ్రీనివాస్, దేవునూరి కుమార్, అరికాంతపు అన్నారెడ్డి చెక్క శ్రీధర్, బండారి రామస్వామి, గుడిమల్ల రమేష్, శనిగరపు ఎర్ర భద్రయ్య, శనగరపు శ్రీనివాస్ వార్డు నెంబర్, బండారి సమ్మయ్య, శనిగరపు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *