ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు అందచేసిన శ్రీనివాస్

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పు పరిధిలోని, దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు స్టడీ చైర్లు పంపిణీ చేసారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాలువల శ్రీనివాస్. వివరాల్లోకి వెళితే దేశాయిపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి కాలువల శ్రీనివాస్ ప్రస్తుతం జనగామ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత ప్రాంతానికి కూడా సేవ చేసే ఆలోచనలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్టడీ చైర్స్ పంపిణీ చేసినట్లు శ్రీనివాస్ తెలియజేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని మంచి పౌరులుగా, సమాజంలో రాణించాలని, చెడు ప్రభావాలకు గురి కాకుండా, గొప్ప లక్ష్యాలు ఏర్పరుచుకుని వాటిని సాధించుకునేందుకు దుర్వ్యసనాల బారిన పడకుండా తల్లి దండ్రులకు, పాఠశాలకు దేశాయ్ పేట ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని, తద్వారా సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి సౌకర్యం కోసం స్టడీ చైర్స్ పంపిణీ చేసినందుకు దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు డా. పాలడుగుల సురేందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు నిశాంత్ వేణు, జాకీర్, పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!