గౌడ సంఘం 5 మండలాల నూతన కమిటీలు ఎన్నిక

పరకాల మండల అధ్యక్షుడు గా మార్క రామన్న గౌడ్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కల్లుగీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ హాజరై 5 మండలాల కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా సాంబయ్య గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 66 సంవత్సరాల నుండి గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో పోట్లాడి అర్రాజు, మైబూజ్ సిస్టలను రద్దు చేయించిందని,పెన్షన్ మొదలగు సంక్షేమ పథకాలు గీత కార్మికులకు చెందే విధంగా పోట్లాడుతున్నదని తెలిపారు.ఈ సందర్భంగా పరకాల,నడికుడ,దామెర, కుటుంబ సభ్యులకు శాంపేట, ఆత్మకూరు మండలాల కమిటీని వేయడం జరిగింది.పరకాల మండలం
గౌరవ అధ్యక్షులుగా బుర్ర రాజమౌగిలి గౌడ్,అధ్యక్షులు మార్క రామన్న గౌడ్,ప్రధాన కార్యదర్శిగా గునిగంటి రవిగౌడ్, ఉపాధ్యక్షులు ఐలి రమేష్ గౌడ్,చిర్ర రాజయ్య గౌడ్, మార్క నాగరాజ్ గౌడ్, కార్యదర్శి బోలిపెల్లి మల్లయ్య గౌడ్,పబ్బ సమ్మయ్య,సలహాదారులు
బండి సదానందం,గునిగంటి చిన్న రవి,ముంజల రాజు,
సోషల్ మీడియా
పులి రాజు గౌడ్ లను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో కలుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బిక్షపతి,కాజీపేట మండలం అధ్యక్షుడు మోడం రాజేందర్, కమలాపూర్ మండల అధ్యక్షుడు మార్కా అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *