బిఆర్ఎస్ కార్యకర్తలు ఆయుధంలా పనిచేయాలి గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలి.

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి కార్యక్రంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తామే ఎమ్మెల్యే అభ్యర్ధిగా భావించి పని చెయ్యాలని కోరారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అయుధంలా పని చేయాలన్నారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ముఖ్య అతిథిగా పత్తిపాక సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు.
గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..యూత్ నాయకులు,పలు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *