#నెక్కొండ, నేటి ధాత్రి :
నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు . అనంతరం మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్ మాట్లాడుతూ రైతులు మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు తేమ 14 శాతం ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో మోడం సురేష్, మార్కెట్ ఏ ఎం ఎస్ భాస్కర్, జ్యోతి ప్రకాష్, ఏ ఈ ఓ వసంత, రైతులు తేరాల ఉపేందర్, మల్లమ్మ, బోళ్ల శ్రీనివాస్, పొట్లపల్లి సురేష్ , స్వప్న ,మార్కెట్ సిబ్బంది రహీం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.