ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించి కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు!!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి.
ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలం కొత్త పేట గ్రామం లో ఎన్నికల ప్రచారం లో భాగంగా ధర్మపురి నియోజక వర్గం అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహ లత, హాజరై,గ్రామం లోని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు,అక్కడ ఉన్న గ్రామ పెద్దలు ప్రజలు,ఘనంగా స్వాగతం పలికారు,అనంతరం కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహా లత మాట్లాడుతూ,మేము ఇంత వరకు ప్రభుత్వం ద్వారా అందే అభివృద్ధిలో మేము భాగ స్వామ్యం అయ్యం,కానీ ప్రభుత్వం ద్వారా కేసీఅర్ సహకారంతో ,కొప్పుల ఈశ్వర్ ప్రజలు అడిగిందే తడువుగా అందరికీ న్యాయం చేశామని మేము బావించాము,అంతే కాకుండా మా ట్రస్ట్ ద్వారా ,కూడా మాకు తోచిన విధంగా అనేక మంది కి పేద వారికి సేవ చేసే అవకాశం ఇచ్చారు,ఇంకా కూడా కొంత మంది మేము అధికారంలోకి రాగానే ఇది చేస్తాం,అది చేస్తాం అని ప్రజలకు మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు,అబద్ధపు ప్రచారాలు,మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే ,మళ్ళీ మనం అభివృద్ధిలో వెనకబడి పోతం,అలా జరుగ కూడదు అంటే కేసీఅర్ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం రావాలి,దానికి మనం అందరం కంకణ బడ్డులై మన బిఆర్ఎస్ కు ఓటు వేసి మన ధర్మపురి అభివృద్ది ప్రదాత కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో మండల బిఅర్ఎస్ పార్టీ అద్యక్షులు సింహాచలం జగన్,జిరెడ్డి మహేందర్ రెడ్డి,మహిళా కో ఆర్డినేటర్ లు, సీనియర్ నాయకులు,రమేష్ నేతలు,మహిళా మణులు, అభిమానులు పాల్గొన్నారు