పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభపూజ చేసి అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మొబైల్ మెడికేర్ యూనిట్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వారికి మందులను అందజేశారు.ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్,డాక్టర్ సంధ్యారాణి,పుల్లూరు వేణుగోపాల్,రెడ్ క్రాస్ డాక్టర్లు కిషన్ రావు,మదన్ మోహన్,రెడ్ క్రాస్ సిబ్బంది గ్రామ పెద్దలు,మాజీ సర్పంచ్ పెసరు మైపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ మాదాసు వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ కన్నబోయిన రమేష్ యాదవ్, దామర సర్పంచ్ గురుజాల శ్రీరామ్ రెడ్డి,బిజెపి మండల అధ్యక్షులు జంగిలి నాగరాజ్, మాందాటి శ్రీకాంత్ కరుగుత్త రమేష్,పిడుగు అనిల్ యాదవ్,మాందాటి ప్రశాంత్, డెంగు రాజు,మాదాసి చిరంజీవి,గంకిడి బుచ్చిరెడ్డి ,గన్ను సతీష్, పెంచాల జగన్ కొలనుపాక సుధాకర్,గొడిశాల సాంబరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.