రాంపూర్ ఈశాన్యం నుండి ఎన్నికల ప్రచారన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే

రామాయంపేట (మెదక్)నేటిధాత్రి.

నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో గురువారం ఈశాన్యం మూలైనటువంటి రాంపూర్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏండ్లు ఎమ్మెల్యేగా పాలించిన మైనంపల్లి 13 ఏళ్ల తర్వాత మళ్లీ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కల్లబొల్లి మాటలతో అనుభవము లేని వ్యక్తి మైనంపల్లి కుమారుడిని ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారని ప్రజలు అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఢిల్లీకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనుభవం లేని వ్యక్తికి రాజకీయ యోగం కలిగిస్తే మెదక్ నియోజకవర్గం మొత్తం కుంటూపడుతుందన్నారు. 2014 నుండి నిజాంపేట మండల ప్రజలు నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఇలాగే మీ ఆదరభిమానాలు ఎల్లవేళలా ఉండాలని రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఒకసారి నన్ను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్దరాములు, ఎన్నికల ఇన్చార్జిశ్రీనివాస్ గౌడ్,కలవకుండా సొసైటీ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సర్పంచులు అమర సేనా రెడ్డి కవిత, బాల నరసవ్వ, కో ఆప్షన్ ఎండి గౌస్,ఎంపీటీసీ బాల్రెడ్డి,బిఆర్ఎస్ నాయకులుమావురం రాజు,అబ్దుల్ అజీజ్ సంగు స్వామి,రామచంద్రం,రెడ్డి శెట్టి రవీందర్,దుబ్బ రాజా గౌడ్,నాగరాజు,రాములు గౌడ్,శ్రీనివాస్ గౌడ్,అంజాగౌడ్, రంజిత్,కేశల యాదగిరి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *