ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన కౌన్సిలర్

కార్యకర్తలు సైనికులలాగ పనిచేయాలి-మడికొండ సంపత్

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గెలుపుకు కార్యకర్తలు నాయకులు సైనికులలాగా పని చేయాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పిలుపునిచ్చారు.55వ బూతు పరిధిలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.తగు సూచనలు సలహాలు ఇచ్చినారు బూతు పరిధిలోని పార్టీ ముఖ్య శ్రేణులు ప్రతి ఓటర్ వద్దకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చల్లా ధర్మారెడ్డి గెలుపే ధ్యేయంగా కష్టపడి పనిచేయాలని కోరరు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్,ఒకటో వార్డ్ అధ్యక్షులు ఒంటేరు శరత్ బాబు,ప్రధాన కార్యదర్శి కందుకూరి విద్యాసాగర్,బి సుగుణాకర్ మరుపట్ల మహేష్,బి సదానందం ఒంటెర్ ప్రణీత్, ఒంటేరు మొగిలి,బి అంజి,బి.విల్సన్ చంద్రశేఖర్,ప్రభు,దుర్గారెడ్డి బొచ్చు శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *