పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి భాద్యత

ఎస్పీ డా. జి వినీత్. ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం టౌన్.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ(ఫ్లాగ్ డే) కార్యక్రమాలలో భాగంగా అక్టోబర్ 21 నుండి 30వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.ఇందులో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ డా. జి వినీత్. ఐపిఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ నుండి ప్రారంభమయ్యి ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద. రైల్వే స్టేషన్,బస్టాండ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి విద్యానగర్ కాలనీ బైపాస్ వద్ద మరలా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి సింగరేణి హెడ్ ఆఫీస్, గోధుమ వాగు బ్రిడ్జి మీదుగా రామవరం,2టౌన్ పోలీస్ స్టేషన్ నుండి రుద్రంపూర్ పార్క్ వరకు సాగింది.ఈ సైకిల్ ర్యాలీలో సుమారుగా 150 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ర్యాలీ ముగిసిన అనంతరం ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పోలీస్ అమరవీరుల స్మారక మెడల్స్ అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎంతమంది పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్చావాయువులను పీల్చగలుగుతున్నామని అన్నారు.వారందరినీ స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు.ఉత్సాహంగా ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయిమనోహర్,ఏఎస్పీ భద్రాచలం పరితోష్ పంకజ్ ఐపిఎస్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, సిఆర్పిఎఫ్ అధికారులు రితేష్ తాకూర్,సెంతిల్ కుమార్,కమల్ వీర్ యాదవ్,రజిత,సందీప్ రెడ్డి,అడిషనల్ కమాండెంట్ అంజయ్య,డీఎస్పీలు రెహమాన్, వెంకటేష్,రాఘవేందర్రావు,రమణ మూర్తి,మల్లయ్య స్వామీ,సీతారామ్ మరియు సిఐలు,ఎస్సైలు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!