నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అసెంబ్లీ టైగర్ ఓంకార్

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్

ఘనంగా అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 15వ వర్ధంతి
నర్సంపేట,నేటిధాత్రి :

నీతి నిజాయితీకి, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం అమరజీవి అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ అని అలాంటి త్యాగదనుల ఆదర్శాలను పునికి పుచ్చుకొని కష్టజీవుల రాజ్యంకోసం కృషి చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్ మద్ది కాయల ఓంకార్ 15 వ వర్ధంతి సందర్భంగా నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కేశెట్టి సదానందం అధ్యక్షతన జరిగిన సభలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ తన జీవితాన్ని దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా సమ సమాజం ఏర్పాటు కోసం సర్వం ధారపోశాడని ఈ క్రమంలో ప్రాణాన్ని సైతం లెక్కచేయక తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో, నిర్బంధ కాలంలో మొక్కవోని ధైర్యంతో ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆదర్శవంతమైన పాత్ర పోషించి చరిత్రలో దిక్సూచిగా నిలబడినాడని పేర్కొన్నారు. ఇప్పటికీ బూర్జువా పార్టీల నేతలు సైతం ఓంకార్ పేరు ప్రస్తావిస్తున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం అవుతుందన్నారు. సమాజం మారాలంటే కుల వ్యవస్థ అడ్డుగా ఉన్నదని సామాజిక న్యాయమే అందుకు పరిష్కారమని వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ అంటూ విషదికరించిన మేధావి ఓంకార్ అని పేర్కొన్నారు.ఓంకార్ చూపిన బాటలో సామాజిక న్యాయస్థాపనధ్యేయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను స్థాపించి వివిధ పార్టీలను సామాజిక సంఘాలను ఐక్యపరిచి ఎంసిపిఐ(యు) ముందుకు సాగుతున్నదని ప్రస్తుత అవినీతి అవకాశవాద రాజకీయాలలో ఎలాంటి మచ్చలు లేని ఏకైక పార్టీ ఎంసిపిఐ(యు) మాత్రమే అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓంకార్ ఆశయ సాధనకు నిలబడే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గణిపాక బిందు,అచ్చం లక్ష్మి,స్వరూప, నాగరాజు ,అల్లం అయిలమ్మ, భవాని, కొమరమ్మ స్వప్న ,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!