వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన డీజీఎం ప్రసాద్

మందమర్రి, నేటిధాత్రి:-

వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్, గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ వార్షిక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీఎం ఎఫ్ఏ ఆర్విఎస్ఆర్కె ప్రసాద్ హాజరై, వాలీ బాల్ డిపార్ట్ మెంటల్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని కంపెనీ లెవెల్, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని మందమర్రి ఏరియాకు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త ఎ రవికుమార్, క్రీడల జనరల్ కెప్టెన్ టీ చిన్నయ్య, వాలీబాల్ కెప్టెన్ వి రాములు, గ్రౌండ్ ఇంచార్జ్ నస్పూర్ తిరుపతి, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *