పరేషాన్ అవుతున్న పాడి రైతులు.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని
విజయ డైరీ ద్వారా మండలంలోని కూచూరు, దొడ్డిపల్లి గ్రామాల పాలబూతుల నుండి పాలను జడ్చర్ల సెంటర్ ద్వారా ఇకనుండి స్వీకరించబోమని డైరీకి సంబంధించిన అధికారులు తెలుపడంతో మండలంలోని
ఆయా గ్రామాల పాడి రైతులు
తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాడివృత్తిని జీవనాధారంగా చేసుకుని ఉపాధి పొందుతున్న రైతులను అధికారుల ప్రకటన
తీవ్ర ఆందోళనకు,మనస్థాపానికి గురిచేసింది. ఆయా గ్రామాల్లో రెండు,రెండు సెంటర్లు ఉండడంతో
వర్షాబావ పరిస్థితుల వల్ల ఈసారి పంటలు కూడా సక్రమంగా లేకపోవడంతో గణనీయంగా పాలు ఉత్పత్తి చేసి తమ గ్రామాలలో
గల సెంటర్లలో విక్రయిస్తున్నారు. అయితే ఆయా గ్రామాల నుండి పాలు డిమాండ్ కు మించి సరఫరా అవుతుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తమ పాలను కొనుగోలు చేయాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు అనుకూలంగా ఉన్న బూతులను తొలగించరాదని వాటిని యధాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ తమ గ్రామాలలో
పాలబూతులను బంద్ చేస్తే
పాల వ్యాన్లను, ఆటోలను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!