ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సోమన్న

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి మండలం విస్నూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న పెనుగొండ సోమన్నకు 2022-23 విద్యా సంవత్సరంకు గాను పాఠశాల విద్యకు విశేష కృషి చేసి, పాఠశాల విద్యార్థులు సుమారు 100 మంది చేరేలా చూసాడు. పక్క గ్రామాలు అయిన విస్నూర్, వడ్డెర కాలనీ, చీమలాభాయ్ తండా, కుంతవత్తు తండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బడికి రావడానికి రవాణా సౌకర్యం కల్పించి దాతల సహకారం తో వాహనం ఏర్పాటు చేసి పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. 5 గురు ఉపాద్యాయులు,100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో మంది దాతల సహకారంతో టాయిలెట్లు, నీటి పంప్, ప్రహారి గోడ, గేట్ నిర్మాణము, విద్యార్థులకు చల్లటి వాతావరణంలో చదువుకోవడానికి అన్ని తరగతి గదులకు ఫాన్స్, విద్యార్థులకు సులభంగా అర్ధం కావడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి వారి సహకారం తో 43 ఇంచుల టివి ని ఏర్పాటు చేశాడు. పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన నీరు త్రాగడానికి వాటర్ ప్యూరిఫైయర్, విద్యార్థులు చక్కగా చదువుకోవడం కోసం డ్యూయల్ డెస్క్ లను ఏర్పాటు చేయడానికి దాతల సహకారాన్ని కోరి ఏర్పాటు చేశాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 2000 సంవత్సరం నుండి కొడకండ్ల లో 5 సంవత్సరాలు మండల రిసోర్స్ పర్సన్ గా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఇచ్చాడు. అటు జిల్లా ఉన్నతాధికారులకు, మండలంలో ఉన్న టీచర్స్కు అనుసంధాన కర్తగా ఉండి విశేష సేవలు చేసాడు. ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాటం చేస్తూ, ఉపాధ్యాయ సంఘ బాధ్యత కూడా నిర్వర్తించి ఉపాధ్యాయులు మెప్పు పొందారు. అటు ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పాఠశాల విద్యార్థుల కోసం నిరంతరం శ్రమిస్తూ మండలంలోనే ఒక ఆదర్శ పాఠశాలగా రూపు దిద్దుకునేల కృషి చేశాడు. అంతకు ముందు యుపిఎస్ తీగారం పాఠశాలలో 9 సంవత్సరాలు పనిచేసి, తీగారంలో తను చదువు నేర్పిన విద్యార్థులు డాక్టర్స్, ఇంజినీర్లు, పోలీసులు, అయ్యారని ఈ సందర్భంగా సోమన్న తెలిపారు. ప్రస్తుతం విస్నూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా సేవలు అందిస్తూ, అటు పాఠశాల అభివృద్ధికి దోహదం చేసాడు. అంతే గాక తన సొంత ఖర్చులతో పాఠశాల విద్యార్థుల కొరకు పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందించాడు. ఇంకా పాఠశాల కోసం నిత్యం తపిస్తూ ప్రవాస భారతీయులు దొంతినేని వెంకటేశ్వరరావు సహాయం కోరి విద్యార్థుల కోసం సుమారు 50 వేల రూపాయలు తో క్రీడా పరికరాలు, ప్రహారి గోడ నిర్మాణం చేయించారు. ఇంకా ఎప్పటికి పాఠశాల అభివృద్ధి కోసం మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు సహాయం చేసే ఘంటా రవీందర్ సహకారంతో పాఠశాలను ఎంతో అభివృద్ధి పథంలో నడిచేలా చేసాడు. తన సొంత డబ్బులు వెచ్చించి గ్రామములో చదువుకుంటున్న 90 మంది విద్యార్థులకు కరాటే, కుంగ్ ఫు, మార్షల్ ఆర్ట్స్ లో 4 నెలలు శిక్షణ ఇప్పించాడు. పిల్లలకు విద్యా విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ మండల, జిల్లా స్థాయిలో బహుమతులు గెలుచుకునేల ప్రోత్సాహం అందించారు. ప్రతి పోటీ పరిక్షలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నాడు. ఉపాధ్యాయుల సహకారం, గ్రామస్థుల సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం తో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ తను చదువు నేర్పించే విద్యార్థుల తల్లిదండ్రులకు తలలో నాలుక లాగా దగ్గరయ్యాడు. తను చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నేడు జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. నేడు ఈ అవార్డ్ ను ఇటీవలే మరణించిన మా అమ్మ కీ.శే శ్రీమతి పెనుగొండ సరోజనకి అంకితం ఇస్తున్నాను అని ఈ సందర్భంగా సోమన్న తెలిపారు. అవార్డ్ వచ్చినా సందర్భంగా పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!