ఎమ్మెల్సీ పల్లాను కలిసిన మాజీ సర్పంచి శ్రీనివాస్

 

చేర్యాల నేటిధాత్రి…

పట్టా బద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ని మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసి డైరెక్టర్ వల్లూరు శ్రీనివాస్ హైదరాబాదులోని పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఆదేశం మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని వల్లూరి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆయనతోపాటు జిల్లా నాయకులు టీ. ఉప్పలయ్య, మాజీ కౌన్సిలర్ గుజ్జుల తుకారం, ఇరుగు సిద్దులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!